
పంజాగుట్ట, వెలుగు: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి పంజాగుట్ట పీఎస్లో తనపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ హైకోర్టులో ఇమ్రాన్ గురువారం పిటిషన్ వేశాడు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా స్టే ఇవ్వాలని కోరాడు. అందుకు కోర్టు నిరాకరిస్తూ పోలీసు విచారణకు సహకరించాలని ఇమ్రాన్ను ఆదేశించింది. కాగా, విష్టు ప్రియ, శ్యామల తమ కేసును కొట్టి వేయాలంటూ ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.